‘తలైవి’పై కంగనా ట్వీట్
తమిళనాడు మాజీ సీఎం.. నటి జయలలిత బయోపిక్ ‘తలైవి’ షూటింగ్ పూర్తయ్యింది. ఈ బయోపిక్ లో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనారనౌత్ తలైవి పాత్రను పోషిస్తున్నది. కాగా ఈ సినిమా ఏఎల్ విజయ్ దర్శకత్వంలో విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అంతా పూర్తయ్యింది. ఈ విషయాన్ని జయలలిత పాత్రను పోషిస్తున్న కంగనా తెలియజేస్తూ ఓ ఎమోషనల్ ట్వీట్ చేసింది. ‘ఇలాంటి పాత్ర యాక్టర్కి అరుదుగా లభిస్తుంది. ఈ పాత్రతో ప్రేమలో పడిపోయాను. విప్లవ నాయకురాలి పాత్ర. సినిమా షూటింగ్ పూర్తయ్యింది’ అని పోస్ట్ చేసింది.
డైరెక్టర్ విజయ్, విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్, విజయేంద్ర ప్రసాద్, బృంద ప్రసాద్, నీతా లుల్లా, రజత్ సరోరా, బల్లూసలూజ, జీవీ ప్రకాశ్, అరవింద స్వామి వంటి వారితో కలిసి నటించడం జీవితంలో దొరికి అదృష్టంగా భావిస్తున్నానని కూడా కంగనా తెలిపింది. ఇలాంటి యూనిట్ను వదిలపోవడం బాధగా ఉన్నది. మిశ్రమ భావోద్వేగాలతో ఉన్నానని చెప్పింది. మెసేజ్తో పాటు జయలలిత విక్టరీ సింబల్ ఉన్న ఫొటోను.. తను కూడా జయలలిత లుక్లో ఉన్న అదే ఫోజును పోస్ట్ చేసింది. ఇక పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. తలైవిని వచ్చే ఏడాది జయలలిత జయంతి సందర్భంగా ఫిబ్రవరి 24న విడుదల చేసే అవకాశం ఉన్నది. ఇందులో ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామి, కరుణానిధి పాత్రలో ప్రకాశ్రాజ్, శోభన్బాబుగా జిస్సుసేన్ గుప్తా, జయలలిత స్నేహితురాలు పాత్రలో నటి పూర్ణ నటించారు.