పొట్టి సిరీస్ ఐపీఎల్ సందడి ముగియడంతో ఇప్పుడు ఆస్ట్రేలియాతో తలపడేందుకు టీమిండియా సిద్ధమైంది. రోహిత్ శర్మ మినహా మిగతా ఆటగాళ్లందరూ ఇప్పటికే ఆసీస్ కు పయనమయ్యారు. మరోవైపు టెస్ట్ సిరీస్ కోసం 17 మందితో కూడిన జట్టును ఆస్ట్రేలియా బోర్డు తాజాగా ప్రకటించింది. ఇందులో ఐదుగురు యువ ఆటగాళ్లకు స్థానం కల్పించడం విశేషం. దేశవాళీ క్రికెట్ లో వరుసగా రెండు డబుల్ సెంచరీలు చేసిన విల్ పుకోవిస్కి అనే యువకుడు జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఈ నెల 27 నుంచి భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ మొదలుకానున్నది.
ఆస్ట్రేలియా టెస్టు జట్టు..
టిమ్ పైన్ (కెప్టెన్), జేమ్స్ ప్యాటిన్సన్, విల్ పుకోవిస్కి, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మిచెల్ స్వెప్సన్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, సీన్ అబోట్, జో బర్న్స్, పాట్ కమ్మిన్స్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్వుడ్, ట్రావిస్ హెడ్ , మార్నస్ లాబుస్చాగ్నే, నాథన్ లియోన్, మైఖేల్ నేజర్.