రూ. 5లక్షల రైతు భీమాకు ఇదే చివరి గడువు..
కొత్తగా భూమి రిజిస్టర్ చేసుకున్న రైతులు, ఇప్పటి వరకు రైతు భీమా దరఖాస్తు చేసుకోని రైతులు ఈ సంవత్సరం రైతు భీమా (రైతు మరణిస్తే వచ్చే 5 లక్షల భీమా) చేసుకోవడానికి ఇంకా అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నిబంధనల ప్రకారం, రైతు భూమి 03.08.2021 లోపు రిజిస్టర్ చేసుకొని ఉండాలి. రైతులు 18 నుండి 59 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. వయస్సు పక్కాగా ఆధార్ కార్డ్ ప్రకారమే తీసుకుంటారు. అందులో ఎలా ఉంటే అదే ప్రామాణికం. ఎన్ని చోట్ల భూమి ఉన్నా ఒక ఊరిలో మాత్రమే భీమాకు అవకాశం ఉంటుంది. రైతే స్వయంగా వచ్చి నామినేషన్ ఫారం మీద సంతకం చేసి భూమి పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్, నామినీ ఆధార్ కార్డ్ జిరాక్స్ AEO కు అందజేయాలి. AEO మరియు MAO లు వాళ్ళ లాగ్ ఇన్ నుండి 12.08.2021 లోపే LIC కి పంపాలి. కావున రైతులు 11.08.2021 లోపే అప్లికేషన్ ఇవ్వాలి. అప్పుడే వాళ్ళవి ఆన్లైన్ చేయడానికి వీలు అవుతుంది. ఇప్పుడు మీరు భీమా చేసుకోకపోతే ఇంకో సంవత్సరం వరకు భీమా చేసుకోవడానికి అవకాశం ఉండదు. రైతు మరణించిన తరువాత వచ్చి ఎంత మంది అధికారులను, ప్రజా ప్రతినిధులను అడిగినా కూడా భీమా సొమ్ము ఇప్పించడం కష్టం. కావున ఇప్పుడే మూడు అడుగులు వేసి 3 కాగితాలు అందివ్వండి. మీ మరణానంతరం రూ5లక్షల రైతు బీమా మద్దతును మీ కుటుంబానికి ఇవ్వండి.