ఎగ్జామ్ లేకుండానే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు
భారత ప్రభుత్వ ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వశాఖకు చెంది ఢిల్లీలోని భారత వాతావరణశాఖ (ఇండియా మెటీయోరాలాజికల్ డిపార్ట్ మెంట్- IMD) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. ఇందులో సైంటిస్ట్ ఈ, సైంటిస్ట్ డీ, సైంటిస్ట్ సీ మొత్తం 54 పోస్టులను భర్తీ చేయనున్నది. ఈ పోస్టులకు ఎలాంటి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నది. ఆన్ లైన్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
సైంటిస్ట్ E : 8 పోస్టులు
– ఫోర్ కాస్టింగ్, ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగాలలో సైంటిస్ట్ ఈ పోస్టులను భర్తీ చేయనున్నది.
– ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీసం 60% మార్కులతో సంబంధిత సబ్జెక్టులలో బీఈ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
అభ్యర్థులకు దరఖాస్తు చేసే చివరి తేదీ వరకు 50 ఏళ్లు దాటకూడదు.
సైంటిస్ట్ D : 29 పోస్టులు
– ఫోర్ కాస్టింగ్, ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అగ్రికల్చర్ మెటీయోరాలజి డిపార్ట్మెంట్స్లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నది.
– ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి కనీసం 60% మార్కులతో సంబంధిత సబ్జెక్టులలో బీఈ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
– అభ్యర్థులకు దరఖాస్తు చేసే చివరి తేదీ వరకు 50 ఏళ్లు దాటకూడదు.
సైంటిస్ట్ C : 17 పోస్టులు
– ఫోర్ కాస్టింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ డిపార్ట్మెంట్స్లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నది.
– ఈ పోస్టులకు అప్లై చేయడానికి కనీసం 60% మార్కులతో సంబంధిత సబ్జెక్టులలో బీఈ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
– అభ్యర్థులకు దరఖాస్తు చేసే చివరితేదీ వరకు 40 ఏళ్లు దాటకూడదు.
ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ ఫిబ్రవరి 22. పూర్తి వివరాలు https://mausam.imd.gov.in చూడొచ్చు.