ప్రయాణిస్తున్న బస్సులో భారీ మంటలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. ప్రయాణంలో ఉన్న బస్సులో ఆకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగి.. పొగ వ్యాపించింది. అయితే డ్రైవర్‌ అప్రపమత్తతో పెద్ద ప్రమాదం తప్పింది. పాయకరావుపేట జాతీయ రహదారి వై జంక్షన్‌పై ఈ ప్రమాదం జరిగింది. మంగళవారం ఒడిశా నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు బస్సు పాయకరావుపేట వై జంక్షన్‌ వద్దకు రాగానే బస్సులో హఠాత్తుగా మంటలు చెలరేగి పొగలు రావడం ప్రారంభమైంది. అప్రత్తమైన డ్రైవర్‌ వెంటనే బస్సును ఆపి ప్రయాణికులను కిందకు దించారు. ప్రమాదం గురించి తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *