మళ్లీ ఆసుపత్రిలో చేరిన దాదా..
బీసీసీఐ అధ్యక్షుడు, టీమ్ఇండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ గుండెపోటుకు గురై పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని వుడ్ల్యాండ్స్ ఆసుపత్రిలో జనవరి 2న చేరిన సంగతి తెలిసిందే. తాజాగా గంగూలీ మరోసారి ఆస్పత్రిలో చేరారు. గంగూలీకి ఛాతి నొప్పి రావడంతో కోల్కతాలోని అపోలోకు తరలించారు. మంగళవారం రాత్రి అనారోగ్యానికి గురైన గంగూలీ.. బుధవారం మధ్యాహ్నం మరోసారి ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పడంతో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ వార్త వినగానే కుటుంబసభ్యులతో సహా క్రికెట్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఆయన ఆరోగ్య పరిస్థితి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.