రాత పరీక్ష లేకుండానే రైల్వేలో ఉద్యోగాలు
నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది రైల్వే శాఖ. 2,532 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఇండియన్ రైల్వే నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ముంబై ప్రధాన కేంద్రంగా పని చేస్తున్న సెంట్రల్ రైల్వేలో ఉన్న ఖాళీల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదలైంది. ఎలాంటి రుసుము దరఖాస్తు కోసం చెల్లించక్కర్లేదు. మార్చి 5వ తేదీలోగా అప్లై చేసుకోండి. ఎంపికైన అభ్యర్థులు నాగ్పూర్, భుసావల్, షోలాపూర్, ముంబై, పుణె డివిజన్లలో పని చేయాల్సి ఉంటుంది. ఇక అర్హత విషయం లోకి వస్తే.. పదో తరగతి చదివి ఐటీఐ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మినిమమ్ 50 శాతం మార్కులతో పాసైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. https://www.rrccr.com ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. దీని కోసం తప్పకుండా ఎన్టీవీసీ సర్టిఫికెట్ ఉండాలి. మొత్తం 2,532 ఖాళీలలో క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో, వ్యాగన్ వాడి బందర్ లో ఖాళీలు 469, మాతుంగా వర్క్ షాప్ లో 547 కుర్లా డీజిల్ షెడ్ లో 60 ఖాళీలు ఉన్నాయి.