సద్ది అన్నంలో ఎన్నో పోషకాలు..
ఒకప్పుడు సద్ది అన్నాన్ని సింపుల్గా తీసుకున్నారు. రాత్రి మిగిలినదానిని పొద్దున తినడం నామోషీగా ఫీలయ్యారు. కానీ ఇప్పుడు సద్దన్నంలో గొప్ప పోషకాలు ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు. కొవిడ్ను ఎదుర్కోవడంలో కీలకంగా పనిచేస్తుందని సూచిస్తున్నారు. మరి సద్ది అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసా.. రాత్రి మిగిల్చిన అన్నాన్ని ఒక మట్టి పాత్ర లేదా స్టీల్ గిన్నెలో వేయాలి. దాంట్లో అన్నం మునిగేంత వరకు నీళ్లు పోయాలి. ఆ తరువాత కొన్ని గోరువెచ్చని పాలు పోయాలి. తోడుగా పెరుగు జత చేయాలి. దాంట్లో నాలుగైదు పచ్చి మిరపకాయలు తరిగి వేయాలి. ఉల్లిగడ్డ ముక్కలు, కొంచం ఉప్పు వేసి కలియబెట్టాలి. ఆ తరువాత మూత బెట్టి వదిలేయాలి. అలా రాత్రంతా ఆ అన్నం పులిసిపోయి చద్దన్నంగా మారిపోతుంది. ఉదయం ఆ అన్నం తింటే శరీరానికి శక్తి లభిస్తుంది.
- రాత్రంతా అన్నం పులవడం వల్ల దానిలో చాలారకాల మార్పులు జరుగుతాయి.
- 50 గ్రాముల అన్నాన్ని రాత్రి పులియబెడితే అందులో 1.6 మిల్లీగ్రాములుగా ఉన్న ఐరన్ 35 మిల్లీ గ్రాములకు పెరుగుతుంది. అలాగే పొటాషియం, కాల్షియంలు కూడా భారీ మొత్తంలో పెరుగుతాయి. ఇవన్నీ మన శరీరాన్ని మరింత ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతాయని, రోగ నిరోధక శక్తిని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు.
- శరీరంలో వేడి ఎక్కువగా ఉన్న వారు చద్దన్నం తింటే ఆ వేడి తగ్గుతుంది.
- ఎక్కువ సమయం ఉల్లాసంగా గడపడానికి చద్దన్నం ఉపయోగపడుతుంది.
- పలు చర్మవ్యాధుల నుంచి సద్దన్నం కాపాడుతుంది.
- పేగుల్లో అనారోగ్య సమస్యలను సైతం తగ్గిస్తుంది.
- మలబద్దకం, నీరసం తగ్గిపోతాయి. బీపీ అదుపులో ఉంటుంది.
- కడుపులో మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది.
- ఆంగ్సైటీ తగ్గుతుంది.
- బీ12, బీ 6 విటమిన్లు, పీచు అధికంగా లభిస్తుంది.
- మజ్జిగలో ఫ్రెండ్లీ బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి రక్షణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి.
- మన శరీరంలో ఉండే హానికర వైరస్లను నాశనం చేస్తుంది. కరోనాను ఎదుర్కోవడానికి చద్దన్నంలో అనేక పోషకాలు ఉంటాయని తెలిశాక.. ఇంట్లో చద్దన్నం తయారు చేసుకొని తింటున్నారట పలువురు.మరి మీరు ట్రై చేయండి.