2డీజీని విడుదల చేసిన రాజ్ నాథ్ సింగ్..
2-డియాక్సీ డి-గ్లూకోజ్(2డీజీ) ఔషధాన్ని విడుదల చేశారు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) అభివృద్ధి చేసింది 2డీజీని. . ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్తో పాటు పలువురు అధికారులు కూడా పాల్గొన్నారు.ఈ ఔషధాన్ని గతంలో కేన్సర్ కోసం తయారు చేశారు. మానవ శరీరంలో కేన్సర్ కణాలకు గ్లూకోజ్ అందకుండా ఈ మందు అడ్డుకుంటుంది. ఇదే సూత్రంతో కరోనా వైరస్ చికిత్స కోసం పరిశోధన ప్రారంభించి కొన్ని నెలలుగా పరిశోధనలు జరిగాయి. మనిషి శరీరంలోకి ప్రవేశించిన కరోనా కణాలకు గ్లూకోజ్ అందకపోతే కణ విభజన జరగదని పరిశోధకులు గుర్తించారు. దీంతో శరీరంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుందని చెప్పారు.తొలి విడతలో భాగంగా 2డీజీ ఔషధం పది వేల సాచెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఏడాది జూన్లో పూర్తి స్థాయిలో మార్కెట్లోకి ఈ ఔషధం అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం దీన్ని రెడ్డీస్ ల్యాబ్ ఉత్పత్తి చేస్తోంది. నీటిలో కలుపుకుని తాగేలా పౌడర్ రూపంలో దీన్ని తీసుకొచ్చారు.